రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్

రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ కూతురు గాయ‌త్రి (38) గుండెపోటుతో శుక్ర‌వారం అక్టోబర్ 4న క‌న్నుమూసింది. గాయత్రి మ‌ర‌ణంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. దీంతో సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ X ద్వారా రాజేంద్ర ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

"నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. 

ALSO READ | వందేళ్ల అందానివే.. ‘విశ్వం’ నుండి మూడో పాట

38 ఏళ్ల గాయత్రి ప్రొఫెషనల్ న్యూట్రీషియన్. గాయ‌త్రి కూతురు సాయితేజ‌స్విని మ‌హాన‌టి సినిమాలో చిన్న‌నాటి కీర్తిసురేష్ పాత్ర‌లో క‌నిపించింది.

రాజేంద్రప్రసాద్ తల్లి కమలేశ్వరి దేవి ఆయన చిన్నతనంలోనే మరణించగా.. తన కుమార్తె గాయత్రిలోనే తన తల్లిని చూసుకుంటానని ఒకానొక సినిమా ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇపుడు కూతురు గాయ‌త్రి మరణం ఆయన్ను ఎంతగా బాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.