అక్టోబర్ 3వరకు జానీ మాస్టర్‌కు జ్యుడీషియల్‌‌రిమాండ్‌

అక్టోబర్ 3వరకు జానీ మాస్టర్‌కు జ్యుడీషియల్‌‌రిమాండ్‌
  • ముగిసిన జానీ మాస్టర్‌‌ పోలీస్‌‌ కస్టడీ
  • వచ్చే నెల3 వరకు జ్యుడీషియల్‌‌ రిమాండ్‌‌
  • చంచల్‌‌గూడ జైలుకు తరలించిన నార్సింగ్‌‌ పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: జానీ మాస్టర్‌‌ పోలీస్‌‌ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో నార్సింగ్ పోలీసులు ఆయనను ఎల్‌‌బీనగర్‌‌లోని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌‌ విచారణ కోసం బుధవారం పోలీస్‌‌ కస్టడీకి అప్పగించారు. కస్టడీ ముగియడంతో శనివారం కోర్టులో హాజరుపరుచగా వచ్చే నెల 3 వరకు జ్యూడిషియల్‌‌ రిమాండ్‌‌ విధించారు. దీంతో అతడిని చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.