
- ఐదు రోజులకు ముందే 112 లక్షల టన్నుల టార్గెట్ రీచ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ఓసీ–2 రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం నిర్దేశించిన టార్గెట్ ను ఐదు రోజుల ముందుగానే చేరుకుంది. ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు గురువారం మాట్లాడుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక మైన్112 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం సింగరేణిలోనే రికార్డు అని పేర్కొన్నారు.
ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సహించిన సీఎండీ బలరాం నాయక్, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలోనే రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడంలో కీలక భూమిక పోషించిన కార్మికులు, ఆఫీసర్లకు ఆయనతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు మల్లికార్జున్, ఎండీ రజాక్ అభినందనలు తెలిపారు. మైన్ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు స్పెషల్ఇన్సెంటీవ్ ఇచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు.