అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన .. ఆర్టీసీ రిక్రూట్​మెంట్​లో 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్​

అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన .. ఆర్టీసీ రిక్రూట్​మెంట్​లో 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్​మెంట్​లో 50శాతం అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె, బ్రహ్మచారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఆదివారం కొత్తగూడెం బస్టాండ్​ ఎదుట అద్దె బస్సు డ్రైవర్లతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ దాదాపు 20 ఏండ్లకు పైగా అద్దె బస్సుల్లో చాలీచాలని జీతాలతో డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి ప్రభుత్వం రిక్రూట్​మెంట్​లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అద్దె బస్సు డ్రైవర్లను పర్మినెంట్​ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ప్రోగ్రాంలో సీఐటీయూ నాయకులు వీరన్న, భూక్యా రమేశ్, కత్తి నర్సింహారావు, లిక్కి బాలరాజు, సంజీవరావు, ఉపేశ్, సతీశ్, వీరభద్రం, రామ్​చరణ్​ పాల్గొన్నారు.