కాగ్​ చీఫ్​గా సంజయ్ మూర్తి ప్రమాణం

కాగ్​ చీఫ్​గా సంజయ్ మూర్తి ప్రమాణం

న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా కె.సంజయ్ మూర్తి గురువారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌‌లోని గణతంత్ర మండపంలో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 1989లో ఐఏఎస్​గా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌‌కు ఎంపికైన ఆయన ఆ తర్వాత కేంద్ర సర్వీస్​లోకి వెళ్లారు.

ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంజయ్ మూర్తి  ఏపీలోని అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌‌ఆర్‌‌ మూర్తి కుమారుడు.ఇప్పటివరకు కాగ్​ చీఫ్​గా పనిచేసిన గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం బుధవారంతో పూర్తయింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌‌ఖర్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.