కడప ఎమ్మెల్యే మాధవి పీఏ ఘరానా మోసం..

కడప ఎమ్మెల్యే మాధవి పీఏ ఘరానా మోసం..

కడప ఎమ్మెల్యే మాధవి పీఏ ఓ మహిళను మోపం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.  ఉద్యోగం ఇప్పిస్తానని ఒంటరి మహిళను  కడన ఎమ్మెల్యే పీఏ వాహిద్​ పెళ్లి చేసుకున్నాడు.  ఒంటరిగా ఉంటుందని.. ఆమెకు డబ్బు .. ఉద్యోగం కలుగజేస్తానని మాయ మాటలు చెప్పాడు వాహిద్​.  అంతేకాదు  ఇతగాడు మరో ముగ్గురి అమ్మాయలను ట్రాప్​ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.  

వాహిద్​ మోసాన్ని గుర్తించిన ఓ మహిళ న్యాయం చేయాలని కోరినందుకు ఆ మహిళ కుటుంబంపై దాడి చేశాడని ఆరోపిస్తున్నారు.  పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని బాధిత మహిళ వాపోయింది. ఈ దాడిలో గాయపడిన మహిళ రిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  బాధితురాలి బంధువులు తమకు న్యాయం చేయాలని  కడప ఎమ్మెల్యే మాధవి ఇంటి వద్దకు వెళ్లారు. 

►ALSO READ | ఉక్కు నగరంలో విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికులు పాదయాత్ర..