
హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం విచారకరణమన్నారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హన్మకొండలో అంబేద్కర్ విగ్రహానికి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎంపీ ఫ్రొపెసర్ సీతారాం నాయక్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా మాట్లాడిన కడియం.. దళితులంతా ఏకమై తమ హక్కులు కాపాడుకోవాలన్నారు.