కాకా క్రికెట్ టోర్నీ.. మంచిర్యాల నియోజకవర్గ స్థాయి టాపర్​ నస్పూర్

కాకా క్రికెట్ టోర్నీ.. మంచిర్యాల నియోజకవర్గ స్థాయి టాపర్​ నస్పూర్

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో నస్పూర్​సూపర్​ కింగ్స్​ టీం టాపర్ గా నిలిచింది. ఆదివారం నస్పూర్​ సూపర్​ కింగ్స్, దండేపల్లి లయన్స్​టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్​ చేసిన దండేపల్లి టీం 14.4 ఓవర్లలో 46 రన్స్​కే అలౌట్​అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నస్పూర్​టీం 5.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 రన్స్​చేసి విక్టరీ సాధించింది.

జట్టుకు చెందిన ఓపెనర్లు నరేందర్​గౌడ్​ 25, ప్రసాద్​ 21 రన్స్​చేశారు. 4 వికెట్లు తీసిన మహేశ్​ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎన్నికయ్యాడు. పోటీల నిర్వాహకుడిగా బింగి దుర్గాప్రసాద్​వ్యవహరించారు.