
కోల్బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో ‘మందమర్రి టైగర్స్’ టీమ్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్స్టేడియంలో మంగళవారం ఉదయం మందమర్రి టైగర్స్, కోటపల్లి టైగర్స్జట్లు తలపడ్డాయి. టాస్గెలిచి మొదట బ్యాటింగ్చేసిన మందమర్రి టైగర్స్ టీమ్15 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 రన్స్ స్కోర్ చేసింది.
భార్గవ్ 20 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 43 రన్స్, జి.రమేశ్యాదవ్21 బాల్స్లో 8 ఫోర్లతో 36 రన్స్, శశి 21 బాల్స్లో 5 ఫోర్లు, సిక్స్తో 32 రన్స్ చేశారు. చేజింగ్లో కోటపల్లి టైగర్స్బ్యాటర్లు 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 64 రన్స్ కే పరిమితమ్యారు. మందమర్రి టైగర్స్ కు చెందిన జి.రమేశ్యాదవ్ 26 రన్స్చేయడంతోపాటు, రెండు వికెట్లు పడకొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.
రెండు మ్యాచుల్లో ‘చెన్నూరు టైగర్స్’దే గెలుపు
మధ్యాహ్నం చెన్నూర్ టైగర్స్ టీమ్ రెండు మ్యాచ్లు ఆడగా, రెండింటిలోనూ విజయం సాధించింది. ముందుగా భీమారం, చెన్నూరు టైగర్స్ ఆడగా, ఫస్ట్బ్యాటింగ్చేసిన భీమారం టీమ్ఏడు వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. ధరన్ 43 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 55 రన్స్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నూరు టైగర్స్ ఓపెనర్లే టార్గెట్చేజ్చేశారు.13.3 ఓవర్లలో 128 రన్స్కొట్టి టీమ్ను గెలిపించారు. రాజశేఖర్రెడ్డి 37 బాల్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సుతో 64 రన్స్ చేయడంతో పాటు ఒక వికెట్ తీయడంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మరో బ్యాటర్మీర్జా ఆదిద్ అహ్మద్ 44 బాల్స్లో 8 ఫోర్లతో 59 రన్స్ చేశాడు. తర్వాత రామకృష్ణాపూర్క్రికెట్క్లబ్ టీమ్తో మరో మ్యాచ్ఆడిన చెన్నూరు టైగర్స్, మొదట బ్యాటింగ్చేసి 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 రన్స్ స్కోర్చేసింది. చేజింగ్లో రామకృష్ణాపూర్టీమ్15 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 89 రన్స్ కే పరిమితమైంది. చెన్నూరు ప్లేయర్ఇబ్రహీం షరీఫ్21 రన్స్ చేయడంతో పాటు3 వికెట్ల పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.