
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ బుధవారం ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం మొదటి మ్యాచ్ గోదావరిఖని, పాలకుర్తి జట్ల మధ్య జరుగగా, గోదావరిఖని టీమ్విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన గోదావరిఖని టీమ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 157 రన్స్ చేసింది. తర్వాత చేజింగ్కు దిగిన పాలకుర్తి టీమ్15.3 ఓవర్లలో 82 రన్స్కే ఆలౌట్ అయింది.
గోదావరిఖని ప్లేయర్లు సాయి 20 బాల్స్ లో 30 రన్స్, సంతోష్ 15 బాల్స్లో 22 రన్స్, పాలకుర్తి ప్లేయర్లు శ్రవణ్ 18 బాల్స్ లో 26 రన్స్ చేసి ప్రతిభ కనబరిచారు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్లో యైటింక్లయిన్ కాలనీ, రామగుండం జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన యైటింక్లయిన్ కాలనీ టీమ్20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 రన్స్ చేయగా, తర్వాత బ్యాటింగ్కు దిగిన రామగుండం టీమ్20 ఓవర్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసి ఓడిపోయింది. యైటింక్లయిన్ కాలనీ ప్లేయర్ మాధవ్ 45 బాల్స్లో 63 రన్స్, రామగుండం ప్లేయర్ప్రవీణ్ 47 బాల్స్ లో 45 రన్స్ చేశారు.