కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి పొన్నం

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి పొన్నం

కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్​ నేతలలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగుబలహీన వర్గాలకు కాకా చేసిన సేవలను ఆయన గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ..రాజకీయాల్లో నైతిక విలువలను పాటించి.. ప్రజాస్వామ్యయుతంగా అనేక పరిష్కారం కాని అంశాలను వివేక్​ వెంకటస్వామి పరిష్కరించారని తెలిపారు.  NSUI నేతగా ఉన్నప్పటి నుంచి తమను ప్రోత్సహించి వెన్ను తట్టి ప్రోత్సహించారని మంత్రి పొన్నం అన్నారు. కాకా ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీల అభివృద్దికి ఎంతో కృషి చేశారంటూ.. బలహీన వర్గాలకు న్యాయం జరిగిందుకు మేమంతా వారితో కలిసి  పోరాడామన్నారు,  కాకా వారసులు వివేక్​.. వినోద్​ లను రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చారన్నారు.  వెంకటస్వామి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని మంత్రి పొన్నం అన్నారు. 

ALSO READ | ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాకా కుటుంబంలో పుట్టాను: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ