
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కాకా వెంకటస్వామి’ స్మారక మంచిర్యాల నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీలో క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. గురువారం మంచిర్యాల రాయల్స్, హాజీపూర్ టైగర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ప్లేయర్లు పరుగుల మోత మోగించారు. మొదట బ్యాటింగ్ చేసిన హాజీపూర్ టైగర్స్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. కృష్ణ 42 బాంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 83 రన్స్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మంచిర్యాల టీమ్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాజీమ్ 62 బాల్స్ 9 ఫోర్లు, 2 సిక్స్ తో 93 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ప్రదీప్ 33 బాల్స్లో 10 ఫోర్లతో 50 రన్స్ చేశాడు.
సెకండ్ మ్యాచ్లో..
లక్సెట్టిపేట హీరోస్, దండేపెల్లి లయన్స్ జట్ల మధ్య మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్సెట్టిపేట టీమ్ నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 135 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన దండేపల్లి టీమ్ 14 ఓవర్లలో 100 రన్స్ కే ఆలౌట్ అయింది. 30 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 51 రన్స్ చేసిన లక్సెట్టిపేట జట్టు క్రీడాకారుడు రమేశ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.