![ఆర్కేపీ క్రికెట్ క్లబ్ గ్రాండ్ విక్టరీ.. కాకా క్రికెట్ టోర్నీ](https://static.v6velugu.com/uploads/2024/02/kaka-venkataswamy-memorial-cricket-tournament-as-competition_G9tjLiUvQX.jpg)
- సెంచరీతో అదరగొట్టిన ప్రేమ్చంద్
- మరో మ్యాచ్లో నెన్నెలపై తాండూర్ విజయం
- పోటాపోటీగా కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్స్టేడియంలో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీల్లో రామకృష్ణాపూర్క్రికెట్క్లబ్(ఆర్కేపీ) గ్రాండ్విక్టరీ సాధించింది. శనివారం కోటపల్లి టైగర్స్ జట్టుపై 104 రన్స్తేడాతో గెలిచింది. మొదట ఆర్కేపీ జట్టు బ్యాటింగ్చేయగా ప్రేమ్చంద్ 52 బాల్స్లో 13 ఫోర్లు, 7 సిక్స్లతో 118 రన్స్చేసి అదరగొట్టాడు. తోడుగా సుశాంత్23 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 రన్స్చేసి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ ఇద్దరూ కలిసి 170 రన్స్ జోడించారు.
కోట సతీశ్36, బీవీ రామారావు 34 కూడా రాణించడంతో రామకృష్ణాపూర్క్రికెట్క్లబ్జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 265 పరుగుల భారీ స్కోర్చేసింది. తర్వాత బ్యాటింగ్ కుదిగిన కోటపల్లి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 రన్స్ మాత్రమే చేయగలిగింది. మింటు 37, సాయి కింగ్టాకూర్32 పరుగులు సాధించారు. ఆర్కేపీ జట్టులో 118 రన్స్ చేసిన ప్రేమ్చంద్ ప్లేయర్ఆఫ్ది మ్యాచ్ గా నిలిచాడు. మధ్యాహ్నం జరిగిన పోటీల్లో భీమారం టీం జైపూర్ జట్టుపై 29 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భీమారం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 రన్స్చేసింది. రంజిత్ 48 బాల్స్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 79 రన్స్, వీరేందర్20 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన జైపూర్నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 రన్స్మాత్రమే చేయగలిగింది. 79 రన్స్చేసిన భీమారం జట్టు ప్లేయర్రంజిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
బెల్లంపల్లి పోటీల్లో తాండూర్ జట్టు విక్టరీ
బెల్లంపల్లిలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో నెన్నెల, తాండూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో తాండూర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన నెన్నెల ప్లేయర్లు 17.3 ఓవర్లలో 106 రన్స్చేసి అలౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తాండూర్జట్టు 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి విజయం సాధించింది. 23 రన్స్ చేయడంతో పాటు3 వికెట్లుతీసిన తాండూర్ప్లేయర్ప్రమోద్ ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.