
కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎకనామిక్స్ లెక్చరర్ రావికంటి గోపాలకృష్ణకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. గోపాలకృష్ణ రిటైర్డు ప్రొఫెసర్ ఎస్. రాధాకృష్ణ పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజన కుటుంబాల వ్యవసాయ పద్ధతులు’ అనే అంశంపై స్టడీ చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్చక్రపాణి, లెక్చరర్లు అభినందించారు.