-
కేయూలో వీసీ రమేశ్ దిష్టిబొమ్మ దహనం
-
డప్పు సప్పుడు,- చెప్పులతో నిరసన
వరంగల్ : మూడేండ్ల పాలనలో వర్సిటీని వీసీ తాటికొండ రమేశ్ సర్వనాశనం చేశారని విద్యార్థి సంఘాల లీడర్లు ఆరోపించారు. ఇవాళ్టితో వీసీ పదవీ కాలం ముగియడంతో కాకతీయ యూనివర్సిటీలో వీసీ రమేశ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ‘తాటికొండ.. అవినీతి అనకొండ’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. డప్పు సప్పుడు, చెప్పులతో నిరసన వ్యక్తం చేశారు. కేయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మూడేండ్ల పాలనలో వర్సిటీని సర్వనాశనం చేశారని వీసీపై ఫైర్ అయ్యారు. నేటితో పీడ విరగడైందంటూ నినాదాలు చేశారు.