కాళేశ్వరం కమిషన్​ గడువు మరో 2 నెలలు పొడిగింపు

కాళేశ్వరం కమిషన్​ గడువు మరో 2  నెలలు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​గడువును సర్కారు మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 28తో ప్రస్తుతం ఉన్న గడువు ముగుస్తుండడం.. విచారణ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం కమిషన్​గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్​ 30 వరకు జ్యుడీషియల్​కమిషన్​.. తన రిపోర్టును సమర్పించాలని పేర్కొంది. 

కాగా, ఈ పొడిగింపుతో ఐదోసారి కమిషన్​గడువును పొడిగించినట్టయింది. కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​చైర్మన్​జస్టిస్​ పినాకి చంద్రఘోశ్​ ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. 24 నుంచి మరో దఫా ఓపెన్​కోర్టును నిర్వహించనున్నారు.