ఫిబ్రవరి 25 నుంచి కాళేశ్వరం ఓపెన్​ కోర్టు !

ఫిబ్రవరి 25 నుంచి కాళేశ్వరం ఓపెన్​ కోర్టు !

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ఓపెన్​ కోర్టు మంగళవారం నుంచి జరగనున్నది. మరోదఫా విచారణ కోసం జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ఆదివారం హైదరాబాద్​కు చేరుకున్నారు. ఓపెన్​ కోర్టుకు ఎవరెవరిని పిలవాలనే దానిపై సోమవారం చర్చించి, నిర్ణయించనున్నారు. ఈ సారి విచారణకు ఇరిగేషన్​ మాజీ మంత్రి హరీశ్​రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను   పిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నది.

ఇప్పటికే ఓపెన్​ కోర్టులో భాగంగా కమిషన్​ 109 మంది నుంచి స్టేట్​మెంట్స్​ తీసుకున్నది. వారు చెప్పిన విషయాల ఆధారంగా ప్యారలల్​గా రిపోర్ట్​ను తయారు చేసే పనిలో ఉంది. కాగా, ఈ నెల 28తో కమిషన్​ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే కమిషన్​ గడువును సర్కారు మరో రెండు నెలలపాటు (ఏప్రిల్​ 30 వరకు) ముందస్తుగానే పొడిగించింది. ఈ దఫా ఓపెన్​ కోర్టును వారంపాటు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది.