
- మే రెండో వారంలో ప్రభుత్వానికి అందజేత
- ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే చాన్స్
- హరీశ్రావు, ఈటలను కూడా పిలిచే అవకాశం
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఏర్పాటు చేసిన కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్రిపోర్టు దాదాపు పూర్తయింది. కమిషన్ 400 పేజీలతో రిపోర్టును తయారు చేస్తుండగా, అందులో ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు తెలిసింది. ప్రస్తుతం రిపోర్టు తయారీపైనే దృష్టిపెట్టిన కమిషన్.. మే రెండో వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా కసరత్తు చేస్తున్నది. రిపోర్టు పూర్తయ్యాక అదే వారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కమిషన్నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇంజనీర్లు, ఐఏఎస్అధికారులు, కాంట్రాక్ట్సంస్థలు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా రిపోర్టులో వివరాలను పొందుపరిచి.. అందుకు అనుగుణంగా కేసీఆర్స్టేట్మెంట్తీసుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సహా పలువురు ప్రముఖుల కేసులనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన ఇద్దరు మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్జడ్జి జస్టిస్పీసీ ఘోష్ చైర్మన్గా ప్రభుత్వం జ్యుడీషియల్కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు కమిషన్గడువును పొడిగించింది. ఈ నెల 30తో కమిషన్ గడువు ముగియనుండడంతో మరోసారి పెంచనుంది. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది.
విజిలెన్స్ రిపోర్టు విశ్లేషణ..
రిపోర్టు తయారీ కోసం ఇంజనీర్లు, ఐఏఎస్అధికారుల స్టేట్మెంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలపై కాళేశ్వరం కమిషన్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా ఇప్పటికే ఈ విషయంలో కమిషన్కు విజిలెన్స్డిపార్ట్మెంట్సమర్పించిన నివేదికనూ చైర్మన్జస్టిస్పీసీ ఘోష్పరిశీలిస్తున్నట్టు సమాచారం. విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించి ఆరు పుస్తకాల అనెగ్జర్లలోని అంశాలను లోతుగా పరిశీలించి కమిషన్రిపోర్టులో కొన్ని విషయాలనూ పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఫైనల్రిపోర్టు కోసం కూడా కమిషన్ వేచి చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే రిపోర్టు కోసం ఎన్డీఎస్ఏకు లేఖ రాసినట్టు సమాచారం.
అసెంబ్లీలో రిపోర్టు..
కమిషన్సమర్పించే ఫైనల్ రిపోర్టులో ఏముంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. విజిలెన్స్రిపోర్టులో ఇప్పటికే 39 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మరి కాళేశ్వరం కమిషన్ఎంతమందిపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుందన్న దానిపై ఇటు అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది. ఎలాంటి అంశాలతో రిపోర్టును రూపొందించినా ప్రజలకు తెలిసేలా కచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెడ్తారని భావిస్తున్నారు. జ్యుడీషియల్కమిషన్లు ఇచ్చే రిపోర్టులు ఏవైనా అసెంబ్లీలో పెట్టి చర్చించాకే ముందుకు వెళ్లడం రాష్ట్రంలో సంప్రదాయంగా కొనసాగుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.