కాళేశ్వరం కమిషన్ గడుపు పెంపు

కాళేశ్వరం కమిషన్  గడుపు పెంపు
  •   ఆగస్టు 31 వరకు పెంచిన ప్రభుత్వం
  •  ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రేపటితో ఈ కమిషన్‌ గడువు పూర్తికానుంది. 

దీంతో ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. దీంతో 25వ తేదీ వరకు 60 మంది సీల్డ్‌ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది.