ఇవ్వాల నుంచి కాళేశ్వరం ఓపెన్​ కోర్టు

ఇవ్వాల నుంచి కాళేశ్వరం ఓపెన్​ కోర్టు
  • టీఎస్​ఈఆర్​ఎల్,డ్యామ్​ సేఫ్టీ అధికారులను విచారించనున్న కమిషన్​

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం జుడీషియల్​ కమిషన్​ ఎంక్వైరీ శుక్రవారం నుంచి మళ్లీ మొదలుకానుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లను ఓపెన్​ కోర్టులో విచారించిన కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​.. శుక్రవారం నుంచి అఫిడవిట్లు సమర్పించిన మరికొందరు అధికారులను విచారించనున్నారు. క్రాస్​ ఎగ్జామినేషన్​లో భాగంగా తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీస్​(టీఎస్​ఈఆర్​ఎల్​)కు చెందిన సిబ్బందితోపాటు.. స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ సీఈని కూడా విచారించనున్నట్టు తెలిసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఇంజనీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీస్​ మోడల్​ స్టడీస్​ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ మోడల్​ స్టడీస్​కు సంబంధించిన అంశాలపై ఆ డిపార్ట్​మెంట్​ అధికారుల నుంచి వివరాలను జస్టిస్​ ఘోష్​ ఆరా తీయనున్నట్టు తెలిసింది. మోడల్​ స్టడీస్​లో తేలిన అంశాలు.. బ్యారేజీల సేఫ్టీపై డ్యామ్​సేఫ్టీ అధికారుల రిపోర్ట్​లను క్రాస్​ ఎగ్జామిన్​ చేయనున్నారు. ఓపెన్​ కోర్టును ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.