
- పంప్ హౌస్ లో దెబ్బతిన్న 2 పంపులు, మోటార్లపై పట్టింపేదీ?
- రెస్ట్ లేకుండా నడుస్తున్న మిగతా 3 పంపులు
- డిమాండ్మేరకు లిఫ్ట్ అవ్వని నీరు
- కల్వకుర్తి ఆయకట్టు రైతుల ఇబ్బందులు
నాగర్కర్నూల్, వెలుగు: 4.30 లక్షల ఎకరాలకు సాగు నీరు,3 వేల గ్రామాలకు తాగు నీరందించే మహాత్మాగాంధీ (కల్వకుర్తి) ఎత్తిపోతల పథకంలోని ఫస్ట్లిఫ్ట్ఎల్లూరు పంప్హౌస్. ఇక్కడ 2020 అక్టోబర్లో జరిగిన ప్రమాదంలో పంప్హౌస్ నీటమునిగి, 2 పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయి. మిగతా 3 పంపులను ఏటా యాసంగి, వానాకాలం సీజన్లలో రెస్ట్ లేకుండా నడిపిస్తున్నారు. బేస్తో సహా పైకి లేచిన మూడో పంపు, లీకేజీ సమస్య ఉన్న ఐదో పంపును పూర్తిగా పక్కన పెట్టేశారు. 3 పంపులతో డిమాండ్మేరకు నీటిని లిఫ్ట్చేయలేకపోతున్నారు. ఈ యాసంగిలో మార్చి 31 వరకు మాత్రమే సాగు నీరిస్తామని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
2,400 క్యూసెక్కులకు కుదింపు
లిఫ్ట్ఇరిగేషన్లో పంపులు నడిపేందుకు నిర్దేశించిన గ్యారెంటీ హవర్స్దాటిన తర్వాత వాటిని బంద్పెట్టాలి. పంపులు, మోటార్ల నిర్వహణ, ల్యూబ్రికేషన్, గుర్తించిన ఇతర చిన్న రిపేర్లను చేసిన తర్వాతే తిరిగి నడిపించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా గ్యారెంటీ హవర్స్ను పట్టించుకోకుండా నాలుగున్నరేండ్లుగా పంపులను నడిపిస్తున్నారు. 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సిన ఉండగా 2,400 క్యూసెక్కులను కుదించారు. కేటాయించిన 40 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కేఎల్ఐ స్కీంలోని 28, 29, 30 ప్యాకేజీల కింద ఉన్న కాల్వలకు నీరందక పంట పొలాలు నెర్రెలుబారుతున్నాయి. టెయిల్ఎండ్పొలాల రైతులు నీటి రాకపై ఆశలు వదులుకున్నారు.
సమీక్షలతోనే గడిపిన గత ప్రభుత్వం
ఎల్లూరు పంప్హౌస్ నీటమునిగి, 2 పంపులు పనికి రాకుండా పోతే గత ప్రభుత్వం సమీక్షలతోనే కాలం గడిపింది. ఆ తర్వాత, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పంపులను బాగు చేయడానికి ప్రయత్నించినా ఎండాకాలంలో రెండు నెలల సమయమే ఉండటం, మిషన్ భగీరథ స్కీంకు ఎల్లూరు పంప్హౌస్మోటార్లకు లింక్ఉండటంతో వీలు కాలేదు. ఈ వేసవిలోనైనా పంప్హౌస్పై దృష్టి పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం వర్కింగ్కండీషన్లో ఉన్న 3 పంపుల్లో ఒకదాన్ని స్టాండ్బై గా ఉంచి, 2 పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నారు. గతేడాది కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా కల్వకుర్తి ఆయకట్టు రైతాంగానికి 40 టీఎంసీల నీటిని వినియోగించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న 4 రిజర్వాయర్ల ద్వారా సాగు నీరు, 3 వేల గ్రామాలు,19 మున్సిపాలిటీలకు మిషన్భగీరథ తాగునీరు అందిస్తున్నారు.
ప్రమాదం ఇప్పటికీ రహస్యమే..
ఎల్లూరు పంప్హౌస్ప్రమాదం ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఘటనకు కారణాలేంటో తెలియదు. ఎంక్వైరీ చేయిస్తామన్న గత ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ పవర్హౌస్యాక్సిడెంట్మాదిరిగానే పక్కన పెట్టింది. పూర్తిగా దెబ్బతిన్న మూడో పంపు, సర్జ్పూల్, పంప్హౌస్మధ్య 50 మీటర్ల రాక్లెడ్జర్ గోడ బీటలువారింది. లీకేజీ సమస్య తలెత్తడంతో ఐదో పంపును పూర్తిగా పక్కన పెట్టేశారు.
రూ.15 కోట్లు అవసరం..
ఎల్లూరులో దెబ్బతిన్న పంపుల రిపేర్, హెడ్ రెగ్యులేటరీ నిర్మాణానికి రూ.15 కోట్లు అవసరమవుతాయని ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్అంచనా వేస్తే.. గత ప్రభుత్వం నాలుగేండ్లలో రూ.4 కోట్లు కూడా విడుదల చేయలేదు. పంప్హౌస్నిర్వహణ ఒప్పందం చేసుకున్న పటేల్కంపనీని తప్పించి, నచ్చిన వారికి ఇచ్చేశారు. పంపులను బాగు చేయిస్తే 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ రెండు సీజన్లలో 4.30 లక్షల ఎకరాలకు సాగునీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.