ప్రజావాణికి 209 ఫిర్యాదులు

ప్రజావాణికి 209 ఫిర్యాదులు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ప్రజావాణికి145 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రైతు భరోసా, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు,  ఇండ్ల మంజూరు తదితర వాటిపై ఫిర్యాదులు వచ్చాయి.  దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

నిజామాబాద్​లో..

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్​ కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి.  అడిషనల్ కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు అడిషనల్​కలెక్టర్ సూచించారు.