అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దు : ఆశిష్​ సంగ్వాన్​

అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దు : ఆశిష్​ సంగ్వాన్​
  • కామారెడ్డి, నిజామాబాద్​ కలెక్టర్లు

కామారెడ్డిటౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ కు 73 ఫిర్యాదులు రాగా,  కలెక్టర్, ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్​ చందర్, ఆర్డీవో వీణ స్వీకరించారు. భూ సమస్యలు,  డబుల్​ బెడ్​ రూం ఇండ్లు, పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు వచ్చాయి.  

నిజామాబాద్​ కలెక్టరేట్​లో..

నిజామాబాద్ సిటీ, వెలుగు : ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్​ కలెక్టరేట్​లోని ప్రజావాణికి  70 ఫిర్యాదులు రాగా,  కలెక్టర్, అడిషనల్​కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి స్వీకరించారు.