పండ్ల తోటల సాగుకు అవగాహన కల్పించాలి : కలెక్టర్​ఆశిశ్​సంగ్వాన్

పండ్ల తోటల సాగుకు అవగాహన కల్పించాలి : కలెక్టర్​ఆశిశ్​సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు: సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్​సంగ్వాన్​ సూచించారు.  గురువారం మాచారెడ్డి మండలంలోని సోమార్​పేట, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, మాచారెడ్డి గ్రామాల్లో పర్యటించారు. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకొని చేపట్టిన డ్రాగన్ ఫ్రూట్స్, పండ్ల తోటలు, కూరగాయాల సాగును, నిర్వహిస్తున్న డెయిరీని కలెక్టర్​ పరిశీలించారు.

లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంక్​ లింకేజీ ద్వారా తీసుకున్న లోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఆదాయం పెంచుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్​రావు, డీఆర్​డీవో సురేందర్,  డీపీవో శ్రీనివాస్​రావు,  డీపీఎం రమేశ్, సివిల్​సప్లయ్​డీఎం రాజేందర్, తహసీల్దార్​శ్వేత తదితరులు పాల్గొన్నారు.