బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి​, వెలుగు: వరద బాధితులకు ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలని  కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ ఆదేశించారు. సోమవారం  భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లిలో వరద నీరు చేరిన డబుల్ బెడ్​ రూం ఇండ్లను పరిశీలించారు. స్కూల్​లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులకు మాట్లాడారు.  భిక్కనూరు నుంచి కామారెడ్డి వరకు ఉన్న నేషనల్​ హైవేను   పరిశీలించారు. వర్షానికి పడిన గుంతలను పూడ్చాలని  హైవే ఆథారిటీ ఆఫీసర్లకు ఆదేశించారు. ఆయన  ఆర్డీవో రంగనాథ్​రావు, ఇరిగేషన్​ ఎస్​ఈ శ్రీనివాస్​, డీపీవో శ్రీనివాస్​రావు, డీఎల్​పీవో శ్రీనివాస్​, మండల స్థాయి ఆఫీసర్లు ఉన్నారు.  

 హాస్టల్​తనిఖీ  

పాల్వంచలో ఉన్న ఎస్సీ వెల్ఫేర్​ బాయిస్​హాస్టల్​ను తనిఖీ చేశారు.  స్టూడెంట్స్​తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా స్టూడెంట్స్​కు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.