
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న పథకాలను ఉపయోగించుకొని, ఆర్థికంగా ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇందిరా మహిళ శక్తి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్లో భాగంగా గాంధారి మండల స్వయం సహాయక సంఘం మెంబర్ లతకు శాంక్షన్ అయిన మొబైల్ఫిష్ యూనిట్ ఆటోను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఫిష్తో కొత్త రకం వంటకాలు చేస్తూ వ్యాపారంలో రాణించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో సురేంధర్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.