బాలికలు పోషకాహారం తీసుకోవాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

బాలికలు పోషకాహారం తీసుకోవాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు: బాలికలు పోషకాహారం తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్​ సూచించారు.   పోషకాహార మాసంలో భాగంగా గురువారం  కామారెడ్డి మున్సిపల్​పరిధిలోని  టెకిర్యాల్​ కస్తూర్బా,  హైస్కూల్ లో  రక్త హీనత పరీక్షల క్యాంపు నిర్వహించి ​స్టూడెంట్స్​కు పోషకాహారంపై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. అన్ని స్కూల్స్​లో  కిషోర​ బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు.  

బాలికలకు ఎప్పటికప్పుడు టెస్టులు చేసి  రక్తహీనతతో ఉన్న వారిని గుర్తించి వారికి తగిన పోషకాహారం అందించాలన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, ఐసీడీఎస్​ జిల్లా పీడీ బావయ్య, డీఎంహెచ్​వో  డాక్టర్​ చంద్రశేఖర్, ఆర్డీవో రంగనాథ్​రావు,  కౌన్సిలర్​ శంకర్​రావు,  దేవునిపల్లి పీహెచ్​సీ డాక్టర్  జోహా ముజీబ్​తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి  ప్రగతి సాధించాలి

రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పోగ్రాంలో ప్రగతి సాధించాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు. గురువారం   కలెక్టరేట్​లో  ఎంపీడీవోలు,  సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు,  సీసీలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మహిళా శక్తి పోగ్రాంలో  రూరల్ ఏరియాలోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం  బ్యాంక్​, స్ర్తీ నిధి ద్వారా లోన్లు ఇప్పించాలన్నారు.  మండలాల వారీగా రివ్యూ మీటింగ్​లు నిర్వహించి మరింత పురోగతి సాధించాలని సూచించారు.  ప్రగతి సాధించని ఎంప్లాయీస్​పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో   అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  డీఆర్​డీవో  సురేందర్,  లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ రవికాంత్,  ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ దయానంద్​,   స్త్రీనిధి జిల్లా మేనేజర్​ కిషోర్​ తదితరులు పాల్గొన్నారు.

17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని కలెక్టర్​ తెలిపారు.  గురువారం ఎస్పీ సింధూశర్మతో  కలిసి  కలెక్టరేట్లో ప్రజాపాలన పోగ్రాం నిర్వహణపై ఆఫీసర్లతో మీటింగ్​నిర్వహించారు.  కలెక్టరేట్​లో ప్రజా పాలన పోగ్రాం జరుగుతుంని,  ఇందుకోసం ఆయా శాఖలకు కేటాయించిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.