
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట, వెలుగు : ‘భూభారతి’ దరఖాస్తులు కేటగిరిల వారీగా పొందుపర్చాలని, గురువారం వరకు 12 రెవెన్యూ గ్రామాల్లో1416 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగంపేట తహసీల్దార్ ఆఫీస్లో దర ఖాస్తులు పొందుపరిచే తీరుపై కలెక్టర్సూచనలు చేశారు. లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలపై అప్లికేషన్లు స్వీకరిస్తున్నామన్నారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సదస్సుల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్య క్ర మంలో బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, భూభారతి లింగంపేట మండల ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం లింగంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతుసదస్సులో కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు.
బిచ్కుంద, జుక్కల్గ్రామాల్లో...
పిట్లం, వెలుగు : బిచ్కుంద, జుక్కల్ గ్రామాల్లోని 'భూభారతి' అవగాహన సదస్సులో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని మాట్లాడారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ సర్వే, పెండింగ్ సాదాబైనామాల వంటి సమస్యలపై భూభారతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేసి పాసు పుస్తకంలో భూమి పటం నమోదు చేస్తారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న దృష్ట్యా రైతులు ఫాంపౌండ్లను నిర్మించుకోవాలన్నారు. తొలుత భూభారతి చట్టంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. కార్యక్రమంలో జుక్కల్, బిచ్కుంద మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బందిపాల్గొన్నారు.