ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి రిసెప్షన్​ సెంటర్, మెటీరియల్​డిస్ర్టిబ్యూషన్​ సెంటర్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం గదుల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్​కలెక్టర్​విక్టర్, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ జనార్దన్​ ఉన్నారు. 

కోడ్​ఖచ్చితంగా పాటించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కోడ్​ఖచ్చితంగా పాటించాలని ఆయా పార్టీల ప్రతినిధులకు కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​సూచించారు.  కలెక్టరేట్​లో  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్​అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ భవనాలను వినియోగించరాదన్నారు. ఓటర్లను ప్రభావితం చేయరాదనిచెప్పారు.