
కామారెడ్డి టౌన్, వెలుగు : అనధికార ఫ్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని ఎల్ఆర్ఎస్ హెల్ప్డెస్క్ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫోన్ చేసి సమాచారమివ్వాలన్నారు. పట్టణంలో పారిశుధ్యం లోపించవద్దని, రోడ్ల వెంట మొక్కలకు నీళ్లు పట్టాలన్నారు.
ఫార్కుల్లో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో అనుమతి లేని హోర్డింగ్లను తొలగించాలన్నారు. వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, టీపీవో గిరిధర్ తదితరులు ఉన్నారు.