విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం..

విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం..

కామారెడ్డి జిల్లా  ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్  ఆశిష్ సంఘ్వన్ తనిఖీ చేశారు.  ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.  అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.  శుక్రవారం ( సెప్టెంబర్ 20)  రాత్రి హాస్టల్ లో విద్యార్థులతో కలిసి పడుకున్నారు.   గురుకుల పాఠశాల నిర్వహణ, ఆహార నాణ్యత మొదలగు విషయాల గురించి ఆరా తీశారు.