10 సోసైటీల ఏర్పాటుకు కమిటీ నిర్ణయం : ఆశిష్ సంగ్వాన్

 10 సోసైటీల ఏర్పాటుకు కమిటీ నిర్ణయం : ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో కొత్తగా మరో 10 సోసైటీల ఏర్పాటుకు కమిటీ నిర్ణయించినట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ పేర్కొన్నారు.  మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​లో జరిగిన సహాకార సంఘాల కమిటీ మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. రైతులకు మరింతగా సేవలు అందించేందుకు సోసైటీలను పునర్​ వ్యవస్థీకరణ చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు.   కమిటీ ప్రపోజల్స్​ ను  స్టేట్​ కమిటీకి పంపుతున్నామన్నారు.  అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్​, చందర్​నాయక్​,  డీసీవో రాంమోహన్​, డీఆర్డీవో  సురేందర్, ఫీషరీష్​ అధికారి  శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.

పోషణ పక్షం పోస్టర్ల అవిష్కరణ

పోషణ పక్ష పోస్టర్లను మంగళవారం కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ అవిష్కరించారు. ఈ నెల 22 వరకు పక్షోత్సవాలు జరగనున్నాయి.  రోజు వారీ షెడ్యూల్​ ప్రకారం పోగ్రాంలు నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు.  అడిషనల్​ కలెక్టర్​ చందర్​నాయక్​,  జిల్లా వెల్పేర్​ ఆఫీసర్​  ప్రమీల, సీడీపీవోలు శ్రీలత, కళావతి పాల్గొన్నారు.