
కామారెడ్డి, వెలుగు: రాజంపేట మండలం కొండాపూర్,- ఎల్లారెడ్డిపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు కంప్లీట్ అయ్యాయి. బ్రిడ్జికి ఇరు వైపులా బీటీ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ రోడ్డుపై వెళ్లే వారు మట్టి రోడ్డుపై దుమ్ము లేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని బీటీ పనులు కంప్లీట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.