ఓడిపోయిన వాళ్లు ప్రొసీడింగ్స్​ ఇవ్వడమేంటి ? : వెంకటరమణరెడ్డి

ఓడిపోయిన వాళ్లు ప్రొసీడింగ్స్​ ఇవ్వడమేంటి ?  : వెంకటరమణరెడ్డి
  •   అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి 

కామారెడ్డి, వెలుగు : ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తుల ద్వారా జిల్లా ఇన్​చార్జి మంత్రి ప్రొసీడింగ్స్​ ఇవ్వటం ఏమిటని కామారెడ్డి ఎమ్మెల్యే  కె. వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులకు ప్రయార్టీ ఇవ్వాలన్నారు. తానేమీ పోలీసు రక్షణ, పోలీస్​ ప్రొటో కాల్ గురించి అడగట్లేదన్నారు.  

ఇన్​చార్జి మంత్రి పాత్ర ఏమిటన్నారు.  ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వీరిని నియంత్రించేందుకు ఇన్​చార్జి మంత్రులను పెట్టరా.. అని అన్నారు.   84 ప్రశ్నలు అడిగితే  8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం వచ్చిందన్నారు.  సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టిన ప్రశ్నలకు కూడా ఆయా శాఖల ద్వారా సమాచారం రావట్లేదన్నారు.  ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాదా..? ఇదేనా అని ప్రశ్నించారు.