కాంగ్రెస్​లోకి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్​పర్సన్

కాంగ్రెస్​లోకి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్​పర్సన్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ ​వైస్​చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, ఈమె భర్త చంద్రశేఖర్​రెడ్డి, మరో  కౌన్సిలర్ చాట్ల వంశీ మంగళవారం హైదరాబాద్​లో పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వీరంతా బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వారు.  వైస్ ​చైర్​ పర్సన్ భర్త గడ్డం చంద్రశేఖర్​రెడ్డిని బీఆర్ఎస్ నుంచి ఆదివారం సస్పెండ్​ చేశారు.

దీంతో మరుసటి రోజే కాంగ్రెస్​ లో చేరారు. వీరితో పాటు గడ్డంసూర్య, అరవింద్, బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, వేణు, ఇమ్రాన్, చేవేళ్ల రాజు చేరిన వారిలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు, బ్లాక్​కాంగ్రెస్ ​ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్  ఉన్నారు.