రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎఎస్పీ చైతన్యరెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎఎస్పీ చైతన్యరెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కామారెడ్డి ఎఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు.  దేవునిపల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ఏరియాలను బుధవారం ఎఎస్పీ  పరిశీలించారు. గతేడాది కాలంగా ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగిన ప్రాంతాలను   హాట్ స్పాట్‌‌‌‌‌‌‌‌లుగా గుర్తించి  ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్యాసంపల్లి, టెకిర్యాల్​ శివార్లను ఆమె పరిశీలించారు.  స్పీడ్​బేకర్లు ఏర్పాటు చేయడం,హెచ్చరిక బోర్డుల ఏర్పాటు అంశాలపై సూచనలు చేశారు. రూరల్ ​సీఐ రామన్​, దేవునిపల్లి ఎస్సై రాజు ఉన్నారు.