
కామారెడ్డిటౌన్, వెలుగు: హైదరాబాద్లో శని, ఆదివారాల్లో రోటరీ కాన్ఫరెన్స్అలయ్ బలయ్ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 ఏళ్లుగా రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారికి అవార్డులు ప్రదానం చేశారు. కామారెడ్డికి చెందిన క్లబ్మాజీ అధ్యక్షులు డాక్టర్ బాల్రాజు, ధనుంజయ్, పబ్బ జగన్నాథం, కాశీనాథం, సుభాష్చంద్ జైన్అవార్డులు అందుకున్నారు. క్లబ్అసిస్టెంట్గవర్నర్ జైపాల్రెడ్డి, ప్రెసిడెంట్రాజనర్సింహారెడ్డి, ప్రతినిధులు శ్రీశైలం, శంకర్, కృష్ణహరి, సుధాకర్ పాల్గొన్నారు.