పోలీసుల సమస్యలు పరిష్కరిస్తా : రాజేశ్​ చంద్ర

పోలీసుల సమస్యలు పరిష్కరిస్తా  : రాజేశ్​ చంద్ర
  • కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర 

కామారెడ్డిటౌన్, వెలుగు : పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ రాజేశ్​​ చంద్ర పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్​ ఆఫీస్​లో స్పెషల్ పార్టీ, ఆర్మీడ్ రిజర్వు,  ఎస్కార్ట్,  బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్, పీఎస్​వోలతో ఎస్పీ దర్బార్ నిర్వహించారు.  ఆయా విభాగాల సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీస్​ బలగాల పాత్ర కీలకమన్నారు.  కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టడంతోపాటు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.  కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకుబ్​రెడ్డి, ఆర్​ఐ సంతోష్, ఎస్​బీ సీఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. 

నిందితులకు శిక్ష పడాలి..

నిందితులకు శిక్షపడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.  శనివారం  జిల్లా పోలీస్​ఆఫీస్​లో కోర్టు సిబ్బందికి నిర్వహించిన ట్రైనింగ్​ పోగ్రాంలో ఎస్పీ మాట్లాడుతూ షెడ్యూల్​ ప్రకారం కోర్టులో సాక్షులు హాజరయ్యేలా చూడాలన్నారు.   ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్​ బ్రేక్​ కావొద్దన్నారు.   సమన్లు, వారెంట్లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీసీఆర్​బీ సీఐ మురళీ,  సిబ్బంది పాల్గొన్నారు.