
- యాక్సిడెంట్లు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు
- ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం
- ‘వెలుగు' ఇంటర్వ్యూలో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, వెలుగు : ‘జిల్లాలో జరుగుతున్న నేరాలపై ఉక్కుపాదం మోపుతాం.. యాక్సిడెంట్లు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.. పోలీసులు బాధ్యతగా పని చేయాలి.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం..’ అని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రాజేష్చంద్ర అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ఆఫీస్లో ‘వెలుగు' ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
వెలుగు : పోలీసు శాఖ పరంగా జిల్లాలో ఏ ఆంశాలకు ప్రయార్టీ ఇస్తారు..?
ఎస్పీ : శాంతి భద్రతలను కాపాడడం, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.. పోలీస్ స్టేషన్తో పాటు డివిజన్, జిల్లా ఆఫీసుకు వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్ చేసి పరిష్కరిస్తాం. యాక్సిడెంట్లు, చోరీల నివారణపై స్పెషల్ ఫోకస్ పెడుతాం. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.
వెలుగు : జిల్లాలో గంజాయి అమ్మకాలపై చర్యలు తీసుకుంటారా ?
ఎస్పీ : గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి రవాణాపై స్పెషల్ ఫోకస్ పెడుతాం.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన ఏరియాలను పరిశీలించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.