
- కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి టౌన్, వెలుగు: పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ రాజేశ్చంద్ర హెచ్చరించారు. బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలతో మాట్లాడాలన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఉండేలా చూడాలన్నారు.
రౌడీ, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్, ఏటీఎం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నరసింహ రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, స్పెషల్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.