- ఎస్పీ సింధూశర్మ
లింగంపేట, వెలుగు: పోలీసు విధులు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఉండాలని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్త టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్సై మల్లారెడ్డి ఉన్నారు.