
కామారెడ్డిటౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీసులోని కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ట్రాపిక్ రూల్స్ పాటించని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి ఫైన్లు వేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో పలు చర్యలు చేపడుతున్నామన్నారు. హైవేపై స్పీడ్ లిమిట్ 80 గా నిర్ణయించామన్నారు. వెహికిల్స్ నడిపించే వ్యక్తులు రూల్స్ పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలన్నారు. కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా చౌక్, కలెక్టరేట్ మెయిన్ గేట్ను ఎస్పీ పరిశీలించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి, రూరల్ సీఐ రామన్ తదితరులు ఉన్నారు.