రైతుల కోసం సీఎం రేవంత్​రెడ్డి కష్టపడుతున్నారు : మంత్రి తుమ్మల

రైతుల కోసం సీఎం రేవంత్​రెడ్డి కష్టపడుతున్నారు : మంత్రి తుమ్మల

కామారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం సీఎం రేవంత్​ రెడ్డి కష్టపడుతున్నారన్నారు. బీర్​ఎస్​ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రుణామాఫీ గురించి  మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందన్న ఆయన... ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. రుణమాఫీ... రైతు భరోసా.. రైతు బీమాను అమలు చేస్తామన్నారు. రెండు లక్షల వరకు లోన్​ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ  చేస్తామన్నారు.  సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ.. అర్హులందరికి ఇస్తామన్నారు.

రుణ మాఫీ విషయంలో ఎవరూ ఆధైర్యపడవద్దపి.. కేవలం తెలంగాణలో కోటి 45 లక్షల టన్నుల వరిధాన్యాన్ని పండిస్తున్నారని.. ప్రతి రైతును ఆదుకొనేందుకు సీఎం రేవంత్​ రెడ్డి కష్టపడుతున్నారన్నారు.  ప్రస్తుత సీజన్​ లో ఎక్కువుగా సన్నధాన్యాన్ని పండించారని.. అదనంగా రూ. 500 ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.