వికారాబాద్​ జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు షురూ

వికారాబాద్​ జిల్లాలో కందుల  కొనుగోలు కేంద్రాలు షురూ

వికారాబాద్, వెలుగు: తెలంగాణ మార్క్​ఫెడ్‌‌‌‌ ఆధ్వర్యంలో వికారాబాద్​ జిల్లాలో ఐదు కందుల కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించినట్లు​జిల్లా మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ అధికారి తహీమీన  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొడంగల్ (పీఎసీఎస్), మర్పల్లి (పీఎసీఎస్​), తాండూరు(డీసీఎంఎస్​), వికారాబాద్​ (డీసీఎంఎస్​), పరిగి (డీసీఎంఎస్​) కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాకు రూ. 7,550కు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. 

దళారుల చేతిలో మోసపోవద్దని, ఇతర సందేహాలకు 7288879812కు సంప్రదించాలని సూచించారు.