బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం 1975లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన కంగనా దర్శకత్వం వహించింది.
అలాగే ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన జీ5 తో కలసి సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదల కావలసి ఉండగా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో పలు అభ్యంతరాలు ఉండడంతో రిలీజ్ ఆగిపోయింది. దీంతో ఈ సెన్సార్ విషయంలో కంగనా రనౌత్ కోర్టు ని ఆశ్రయించగా పలు అభ్యంతర సన్నివేశాలను కట్ చేసి సినిమా ని రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.
ALSO READ | ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పొట్టేల్ సినిమా ప్రమోషన్స్..
అయితే తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు ఎమర్జెన్సీ చిత్రాన్ని చూసి సెన్సార్ సర్టిఫికెట్ ని జారీ చేసింది. దీంతో ఈ విషయంపై నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులోభాగంగా "మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము. మీ సహనం మరియు మద్దతు కోసం ధన్యవాదాలు." అని ట్వీట్ చేసింది. దీంతో కంగనా రనౌత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳
— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024
ఈ విషయం ఇలా ఉండగా గతంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలు సిక్కు శనగలు సంఘాలు ఎమర్జెన్సీ చిత్రహంలో మత విద్వేషాలు రచ్చగొట్టే మరియు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటినుంచి ఎమర్జెన్సీ చిత్రం కష్టాలు ఎదుర్కుంటోంది.