సినిమా విడుదల ఆగిపోవడంతో ఖరీదైన బంగ్లా అమ్మేసిన స్టార్ హీరోయిన్..

సినిమా విడుదల ఆగిపోవడంతో ఖరీదైన బంగ్లా అమ్మేసిన స్టార్ హీరోయిన్..

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఈమధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలలో నటించేందుకు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో ఒక్కోసారి తాను నటించే చిత్రాలకి డైరైక్టర్ గా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

కాగా ప్రస్తుతం కంగనా రనౌత్ హిందీలో ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించింది. అలాగే సహనిర్మాతగా కూడా వ్యవహరించింది. పలు అనివార్య కారణాలవల్ల ఎమర్జెన్సీ చిత్రం విడుదల ఆగిపోయింది. దీంతో కంగనా రనౌత్ తీవ్ర నిరాశకి గురైంది.

ఈ విషయం గురించి కంగనా స్పందిస్తూ ఎమర్జెన్సీ చిత్ర విడుదల ఆగిపోవడంతో ముంబై పట్టన పరిధిలో తనకి సంబందించిన రూ.32 కోట్లు విలువ చేసే బంగ్లా ని అమ్మేసినట్లు తెలిపింది. అంతేగాకుండా రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎమెర్జెన్సీ చిత్రాన్ని కచ్చితంగా విడుదల చేస్తానని స్పష్టం చేసింది. 

ఈ విషయం ఇలా ఉండగా ఎమెర్జెన్సీ చిత్రం సెప్టెంబర్ 6వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలో పలు అభ్యంతరకరమైన సన్నివేశాలతోపాటూ  మతఘర్షణలు రేపే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ని జారీ చెయ్యలేదు. దీంతో తాజాగా మరోమారు కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్ కోసం అప్లయ్ చెయ్యగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది.