రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనం లో 3 రోజుల పాటు యువ సమ్మేళనం జరుగుతుంది. రెండో రోజు ( సెప్టెంబర్ 21) జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మార్టిన్ రైజర్ (వరల్డ్ బ్యాంక్ ఉపాద్యక్షుడు), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఇంకా ఈ సదస్సుకు పలు దేశాలకు చెందిన వివిధ రంగాల యువత హాజరయ్యారు.
ఈ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..... ప్రపంచ వ్యాప్తంగా కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం ఉందని .. ఇలాంటి సమయంలో శాంతి, సామరస్యం, సద్బావన పెంచడానికి రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషిని అభినందించారు. గతంలో బంజరు భూమిగా ఉన్న కన్హా ప్రాంతాన్ని అద్భుతం గా తీర్చిదిద్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కన్హా సెంటర్ కు సహాయ సహకారాలుంటాయని అన్నారు. మెడిటేషన్, స్పిరిట్యుయల్ లో కన్హా వాళ్ళు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. కన్హా లో కార్యక్రమాల్లో పాల్గొంటే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.