
మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ సంస్థ, రాస్ర ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’. రాజు బొనగాని దర్శకుడు. చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించిన భరత్ రామ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా హీరోయిన్ పేరును రివీల్ చేశారు. చార్లీ 777, జాగ్వార్ లాంటి కన్నడ చిత్రాలతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అవుతోంది. డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు.