నేనెందుకు రాజీనామా చేయాలి? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

నేనెందుకు రాజీనామా చేయాలి?  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ముడా కుంభకోణం,తన భార్య పార్వతి లేఖపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. నేను మనస్సాక్షితో పనిచేస్తున్నాను. ముడా కేసులో నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. MUDA కేసు మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలకు విరుద్దమైనది.. ఈడీ లేదా మరేదైనా నేను న్యాయ పరంగా పోరాడతాను. అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. 

తన భార్య పార్వతికి ఆమె సోదరుడు గిఫ్ట్ గా ఇచ్చిన భూమిని ముడా ఆక్రమించింది. దీనికోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కోరింది. దీనిపై ప్రతిక్షాలు పెద్ద రాజకీయం చేస్తున్నారు సిద్దరామయ్య విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలకు ఇదొక కారణమని భావించి.. ఎలాంటి వివాదం వద్దని లేఖ రాసిందని సిద్దరామయ్య చెప్పారు. బీఎస్ యడ్యూరప్ప కేసు, నాది వేరే కేసు.. ఆయన భూమి డీనోఫిటికేషన్ చేశారు.. అందులో తన ప్రమేయం లేదని సిద్దరామయ్య చెప్పారు. 

ALSO READ | సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్.. ముడా స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్