
బెంగళూరు: కన్నడ యాక్టర్ రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ ఘటనపై ఆమె తండ్రి, కర్నాటక డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారా తెలియగానే షాకయ్యానని చెప్పారు. ‘‘4 నెలల కిందే రన్యాకు పెండ్లయింది. అప్పటినుంచి భర్తతో ఉంటోంది. మమ్మల్ని కలవలేదు. తన గురించిగానీ, తన భర్త బిజినెస్ గురించిగానీ మాకేమీ తెలియదు. విషయం తెలిసి మేమంతా షాకయ్యాం. బాధపడ్డాం. కెరీర్లో నాపై ఒక్క మచ్చకూడా లేదు. ఈ వ్యవహారానికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని రామచంద్రారావు అన్నారు.
అసలేం జరిగిందంటే..
రన్యారవు కన్నడ నటి. ఆమె ఈ నెల 4న దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చారు. అధికారుల తనిఖీలలో 14.8 కిలోల బంగారం అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు.